అనంతపురం జిల్లా తెలుగుదేశం సీనియన్ నాయకుడు, జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించి త్వరలో ముహూర్తం కూడా ఖరారు కానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ డైరెక్టర్ జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్ తీస్తున్నట్లు తెలుస్తోంది.
జూటూరు రాజు…
ఇప్పటికే టైటిల్ సైతం ఖరారు అయినట్టు సమాచారం. జూటూరు రాజుగా నామకరణం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బయోపిక్ కు సంబంధించిన అన్ని అనుమతులు జైసీ కుటుంబం నుంచి వచ్చాయని, త్వరలోనే అనంతపురానికి ప్రముఖ డైెరెక్టర్ రానున్నారట.
జేసీగా రాజేంద్రుడు…
ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జేసీ దివాకర్ రెడ్డి పాత్రకు ప్రముఖ నటుడు, టాలీవుడ్ రాజేంద్రుడు, రాజేంద్రప్రసాద్ ఎంపికయ్యినట్లు టాక్. రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు, రాయలసీమ వాసులకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారట.
also read : కేటీఆర్ ఆ మాటలు మానుకో.. బీఆర్ఎస్ మాయలో పడొద్దు.. ఎమ్మెల్సీ కోదండరాం