India vs New Zealand: బెంగళూరు టెస్టులో టీమిండియా ( Team India ) ఘోర ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ ( New Zealand )చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది టీమిండియా. ఐదవ రోజు మొదటి సెషన్ లోనే న్యూజిలాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పై 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించడం జరిగింది.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
దీంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో న్యూజిలాండ్ లీడింగ్ లోకి వచ్చింది. న్యూజిలాండ్ ( New Zealand ) బ్యాటర్లు… విల్ యంగ్ అలాగే రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడడంతో… ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను చిత్తు చేసింది న్యూజిలాండ్. వాస్తవగా బెంగుళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదటి నాలుగు రోజుల్లో చాలా రకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో వర్షం కూడా మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. మొదటి రోజు టాస్క్ కుదరకపోగా, రెండు, మూడు రోజుల్లో మంచి ఆటను చూశారు. నాల్గవ రోజు సర్ఫరాజ్ ఖాన్ (SarfaraZ Khan), రిషబ్ పంత్ ల (Rishabh Pant) చాలా బాగా ఆడారు. అయితే వర్షం కారణంగా రెండవ సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. మూడవ సెషన్ ను కూడా ముందుగానే ముగించాల్సి వచ్చింది.
Also Read: ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్..
ఐదో రోజు న్యూజిలాండ్ విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉండగా ఇంకా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ లంచ్ బ్రేక్ ముందే స్కోర్ ను చేదించింది. విల్ యంగ్ (45 ), రచిన్ రవీంద్ర (Rachin Ravidra) (39) పరుగులు చేశారు. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 46, న్యూజిలాండ్ 402 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 462 పరుగులు చేసింది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన కివిస్ 27.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
Also Read: ICC Womens T20 World Cup: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఫైట్..
(76 బంతుల్లో 48 నాటౌట్ బీ 7 ఫోర్లు, 1సిక్స్), రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్ బీ 6 ఫోర్లు) కివీస్ కు విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరూ అజేయమైన మూడవ వికెట్లకు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాన్ని సొంతం చేశారు. భారత్ రెండు వికెట్లు తీసినా, కూడా లక్ష్యం చిన్నది. ఈ తరుణంలోనే న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో కివీస్ 1-0తో విజయాన్ని అందుకుంది. ఇక మరో రెండు టెస్టుల్లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి.