Sidharth Malhotra-Kiara Advani : సినిమా ఇండస్ట్రీలో కొన్ని జోడీలకు జబర్దస్త్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడైతే అలాంటి క్రేజ్ ఉన్న జోడీ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న విషయం గత కొన్నాళ్లుగా మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ గా వీరి పెళ్లి చేసుకోబోయే ప్రదేశం గురించి కూడా బెస్ట్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఫిబ్రవరిలో జైసల్మేర్లో పెళ్లి చేసుకోవడానికి కియారా అండ్ సిద్ ఫిక్స్ అయ్యారట. పెళ్లి తర్వాత ఢిల్లీలో భారీ స్థాయిలో ఫంక్షన్ నిర్వహించాలని అనుకుంటున్నారట. కరణ్జోహార్, వరుణ్ ధావన్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్సింగ్ కలిసి వీరి పెళ్లి పనులు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కియారా అద్వానీ ఇటీవల విక్కీ కౌశల్తో కలిసి గోవింద్ నామా మేరాలో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్ – శంకర్ సినిమాలో నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల థాంక్గాడ్లో కనిపించారు. జనవరిలో ఆయన నటించిన మిషన్ మజ్ను ఓటీటీలో విడుదల కానుంది.ఇందులో ఇండియన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. దీంతో పాటు యోధ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.
ఇటీవల వీరిద్దరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కలిసి ప్రయాణం చేశారు. ఎయిర్పోర్టు విజువల్స్ లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి కోసం ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా వెయిటింగ్. లాక్ డౌన్ టైమ్లో వీరిద్దరూ కలిసి నటించిన షేర్షా రిలీజ్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి, నిజంగా పెళ్లి చేసుకుంటే బావుంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. 2023లో ఆ మాట నిజం చేస్తారని అంటున్నారు సన్నిహితులు.