Ind vs Pak: పాకిస్తాన్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్… A జట్టు పైన… టీమిండియా విజయం సాధించింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. టీమిండియా నిర్దేశించిన… 184 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్… చేదించలేకపోయింది.
దీంతో.. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది మన ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టు. పాకిస్తాన్ బ్యాటర్లలో… అర్ఫత్ 41 పరుగులు చేశాడు. అలాగే యాసిర్ ఖాన్ 33 పరుగులు చేసి రాణించాడు. సమద్ 25 పరుగులు చేసి దుమ్ము లేపాడు. కానీ పాకిస్తాన్ బ్యాటర్లలో ఎవరు కూడా.. విజయం దిశగా జట్టును తీసుకు వెళ్లలేక పోయారు. మిగతా బ్యాటర్ల విఫలం కావడంతో… టీమిండియా చేతిలో ఓడిపోయింది పాకిస్తాన్.
ఇది ఇలా ఉండగా టీమిండియా బౌలర్లలో… అన్షుల్ కాంబోజి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా నిశాంత్, రఫిక్ తను రెండు వికెట్లు పగలగొట్టాడం జరిగింది. అంతకుముందు టీమిండియా బ్యాటర్లు… అద్భుతంగా రాణించడంతో 184 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది టీం ఇండియా. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ విఫలమైంది.