Revanth Reddy book : ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, విద్యార్థి నేతగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంపై సరికొత్త పుస్తకం విడుదలైంది. బీఆర్ఎస్ నియంత పాలనపై ఆయన సాగించిన పోరాటాలు, ముఖ్యమంత్రి వరకు ఆయన సాగించిన ప్రస్థానం మీద కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి, డా. సంగని మల్లేశ్వర్ రచించిన ‘గురి తప్పని విలుకాడు’ అనే పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ దండే విఠల్ పలువురు గ్రంథాలయ చెర్మన్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులంతా రచయితకు శుభాకాంక్షలు తెలిపారు.
ALSO READ:రూ.15 వేలకే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ – గేమింగ్, మల్టీటాస్కింగ్ స్మార్ట్ ఫోన్