Rose Cream: ప్రస్తుతం చాలా మంది అందంగా కనిపించడం కోసం బయట మార్కెట్లో దొరికే ఫేస్ ప్రొడక్ట్స్ కొని వాడుతుంటారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే నేచురల్ ప్రొడక్ట్స్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడవచ్చు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవడానికి గులాబీ పూలను వాడవచ్చు.
గులాబీ పువ్వులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. గులాబీలతో తయారు చేసిన రోజ్ వాటర్ కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. గులాబీ పువ్వుల నుంచి తయారుచేసిన ఫేస్ క్రీమ్ ముఖానికి సహజమైన గ్లో అందిస్తుంది. ముఖంపై మొటిమలు రాకుండా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న గులాబీలతో ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుకుందాం.
గులాబీ పువ్వులతో తయారు చేసిన ఫేస్ క్రీమ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.
రోజ్ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
తాజా గులాబీ పువ్వులు (రేకులు)- 1 కప్పు
కొబ్బరి నూనె- 1/4 కప్పు
తేనె – 1 టీస్పూన్
విటమిన్ ఇ నూనె- కొన్ని చుక్కలు
అలోవెరా జెల్ – 1 టీస్పూన్ (ఐచ్ఛికం)
తయారుచేసే విధానం:
రోజ్ వాటర్ తయారు చేయండి: ముందుగా గులాబీ రేకులను కడిగి బాగా ఆరబెట్టండి. వాటిని ఒక పాత్రలో వేసి నీరు పోసి 5 నిమిషాలు మరిగించాలి. నీరు సగానికి తగ్గినప్పుడు, గ్యాస్ను ఆపివేసి చల్లార నివ్వండి. అది చల్లబడిన తర్వాత నీటిని వడ కట్టండి. ఇప్పుడు మీ రోజ్ వాటర్ సిద్దం అవుతుంది.
రోజ్ వాటర్, కొబ్బరి నూనె కలపండి: తర్వాత 3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ , కొబ్బరి నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి కలపండి.
కలబంద జెల్ కలపండి : (ఐచ్ఛికం) మీ చర్మం పొడిగా ఉంటే, మీరు దానికి అలోవెరా జెల్ కూడా కలపుకోవచ్చు.
క్రీమ్ సిద్ధంగా ఉంది: ఇప్పుడు మీ రోజ్ ఫేస్ క్రీమ్ సిద్ధంగా ఉంది. గాలి చొరబడని కంటైనర్లో నింపి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి.
Also Read: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్
ఎలా ఉపయోగించాలి ?
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ క్రీమ్ రాసుకోవాలి.
దీనిని ముఖంపై మసాజ్ చేయండి.
ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి.
తరుచుగా ఈ క్రీమ్ వాడటం వల్ల ముఖం అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.