Harihara Veeramallu.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)గత కొన్ని నెలలుగా సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి, రాజకీయాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన పార్టీ జనసేన (Janasena) ను గెలిపించుకున్నారు. ముఖ్యంగా కూటమితో జతకట్టిన పవన్ కళ్యాణ్ 21 స్థానాలలో పోటీ చేయగా.. 100% స్ట్రైక్ తో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇక ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తాను సైన్ చేసిన మూడు సినిమా ప్రాజెక్ట్లను కంప్లీట్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చిన విషయం తెలిసిందే.
హరిహర వీరమల్లు షూటింగ్ షురూ..
ఈ నేపథ్యంలోనే గతంలో క్రిష్ డైరెక్షన్ లో ప్రకటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో ఏ ఎమ్ రత్నం వారసుడు ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 23వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. రోజుకి నాలుగు గంటలు సినిమా షూటింగ్ కి ఆయన తన సమయాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. మిగిలిన సమయం మొత్తం ఉపముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యతలకు సమయాన్ని కేటాయిస్తారట. ఇకపోతే ఈనెల 30వ తారీఖు తో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొత్తం పోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే ఆయన ఓజీ మూవీ సినిమా షూటింగ్లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ పాడిన పాట దీపావళి కానుకగా..
ఇదంతా ఇలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో ఒక బిట్ సాంగ్ పాడబోతున్నాడు అనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ పాటను దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం కూడా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. అయితే ఈ పాటను పవన్ కళ్యాణ్ నిన్ననే రికార్డు పూర్తి చేశారని తాజా వార్త వినిపిస్తోంది. అంతేకాదు హరిహర వీరమల్లు షూటింగ్ సెట్లో కేవలం ఒక గంట సమయంలోనే ఈ పాట పూర్తి చేశారట పవన్ కళ్యాణ్.
గంటలో పాట మొత్తాన్ని రికార్డు చేసి సంచలనం సృష్టించిన పవన్..
ఒక గంటలో ఒక పాటను రికార్డు చేయడం ఇప్పటివరకు హిస్టరీలో ఏ రోజు జరగలేదు. ఎంత పెద్ద గాయకుడైనా సరే ఒక పాట పాడడానికి కనీసం ఒకరోజు సమయం తీసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కేవలం గంటలోనే పాట పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. రెండు మూడు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి (M.M.keeravani)సంగీతాన్ని అందించినట్లు సమాచారం ఇకపోతే వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ , తమిళ్ , మలయాళం, కన్నడ భాషలో విడుదల కాబోతోంది భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. పైగా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల కాబోతున్న తొలి చిత్రం కూడా ఇదే కావడంతో సరికొత్త అంచనాలు ఏర్పడ్డాయి.