Naresh : సీనియర్ నటుడు నరేష్ , పవిత లోకేష్ ఈ జంట కొంతకాలంగా హాట్ టాపిక్ గా ఉన్నారు. వీరి బంధంపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. వీరు ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటున్నారు. అలాగే ఎన్నో వివాదాలు వీరి చుట్టూ తిరుగుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే.. ఇప్పుడు వీరి బంధంపై నరేష్ కీలక ప్రకటన చేశారు.
తన స్నేహితురాలు, సహనటి పవిత్ర లోకేశ్ను త్వరలో వివాహం చేసుకోబోతున్నానని నటుడు నరేష్ వెల్లడించారు. దీనిపై శనివారం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. “కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం’’ అని పేర్కొన్నారు. #PavitraNaresh అనే హ్యాష్ట్యాగ్ను ఈ వీడియోకు జత చేశారు. ఇలా వీరి బంధంపై జరుగుతున్న చర్చకు పెళ్లి ప్రకటనతో నరేష్ తెరదించారు.
నరేశ్ కు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయి. కొంతకాలం నుంచి మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నరేష్ ,పవిత్రా లోకేష్ పై ఆమె దాడికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ వివాదం పోలీసు కేసుల వరకు వెళ్లింది.
అటు పవిత్ర సైతం భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో దూరంగా ఉంటారు. నరేష్ , పవిత్ర కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం సహజీవనానికి దారి తీసింది. ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఈ జంట సిద్ధమైంది. కొంతకాలంగా నరేశ్, పవిత్ర పెళ్లిపై అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేష్ తాజాగా చేసిన ప్రకటనతో వారి పెళ్లిపై పూర్తి క్లారిటీ వచ్చింది. మొత్తంమీద 2023లో నరేశ్, పవిత్ర జంట పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో విడాకుల వ్యవహారం పూర్తైన తర్వాతే నరేశ్.. పవిత్రను పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.