Telangana’s Siddi vinayaka Temple : తెలంగాణలోను కాణిపాకం వినాయకుడు ఉన్నాడు. స్వయం భూ సిద్దివినాయకుడి ఆలయాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉండగా..ఒకటి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం ఒకటి. రెండోది సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక ఆలయం. స్వయం భూగా వెలసిన గణనాధుడు భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూసం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఏటా సిద్ధి వినాయకుడి జయంతోత్సవాలను ఘనంగా జరుపుతుంటారు. ఉత్సవాల సమయంలో కర్ణాటక , మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు. 208 ఏళ్ల క్రితం రేజింతల్ సిద్ధివినాయక ఆలయం నిర్మాణం జరిగింది. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన కీకారణ్యంగా ఉండేది.
కొన్ని సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత సిద్ధివినాయక ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. గర్భగుడిలో ఉన్న సిద్ధివినాయకుడి విగ్రహం ఏటా పెరుగుతూ వస్తోంది . స్వామి వారి విగ్రహం వెలిసినప్పుడు రెండున్నర అడుగుల ఎత్తు ఉంటే, ఇప్పుడు ఐదున్నర అడు గుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు చెబుతున్నారు. స్వామి వారి విగ్రహం దక్షిణ వైపు ముఖం ఉండడం, సింధూర వర్ణం పూయడంతో ఆంజనేయస్వా మిగా కనిపిస్తాడు.
ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది.సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. పుష్య శుద్ధ పాడ్యమి నుంచి… పుష్య శుద్ధ చతుర్దశి వరకూ శ్రీ సిద్ధివినాయక స్వామివారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.