Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025).. నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదిరిపోయే ప్లాన్ తో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని చెబుతున్న టీమిండియా కు… ప్రత్యేక సలహా ఇస్తూ లేఖ విడుదల చేసింది. మ్యాచ్ ఉన్న రోజు పాకిస్తాన్ కు వచ్చి.. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇండియాకు తిరిగి వెళ్లిపోయాలా ప్లాన్ చేసుకోవాలని… సూచనలు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025). వచ్చే ఏడాది జరగనుంది. ఈ టోర్నమెంట్ కు ఐసీసీ లెక్కల ప్రకారం.. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ ట్రోఫీ కోసం వచ్చే జట్లకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పాకిస్తాన్ జట్టు యాజమాన్యం. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో… పాకిస్తాన్ (Pakisthan) గడ్డ పైన అడుగు పెట్టబోమని ఇప్పటికే టీమిండియా అటు బీసీసీఐ పాలకమండలి ప్రకటించింది.
Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !
భద్రతా కారణాల దృష్ట్యా.. 2009 నుంచి అసలు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టడం లేదు టీమిండియా (Team india). ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్ జరిగితే… దుబాయ్ వేదికగానే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఛాంపియన్ ట్రోఫీ కోసం… పాకిస్తాన్ వెల్లబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. కానీ.. కచ్చితంగా టీమిండియా రావాల్సిందేనని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.
Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !
కొన్నిసార్లు బుజ్జగిస్తోంది. పాకిస్తాన్ కు వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటామని… టీమిండియా కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. కానీ ఛాంపియన్ ట్రోఫీని.. దుబాయ్ వేదికగా నిర్వహించాలని… భారత క్రికెట్ నియంత్రణ మండలి కోరుతోంది. కానీ పాకిస్తాన్ కు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. ఇలాంటి తరుణంలోనే.. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి…. బహిరంగ లేఖ రాసింది పాకిస్తాన్.
చాంపియన్స్ ట్రోఫీలో ( Champions Trophy 2025) భాగంగా టీమిండియా మ్యాచ్లు ఉన్నప్పుడు.. పాకిస్తాన్ కు రావాలని సూచించింది. మ్యాచ్ అయిపోయిన వెంటనే.. ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వెళ్లిపోవాలని కోరింది. పాకిస్థాన్లో స్టే చేయడం… టీమిండియా కు అసౌకర్యంగా ఉంటే… తమ సూచన పరిశీలించాలని కోరింది. పాకిస్తాన్ గడ్డ పైన ఆడిన వెంటనే.. ఇండియాలోని ఢిల్లీ లేదా చండీగర్… ఇతర ఏ ప్రాంతమైన ఎంచు కొని అక్కడికి వెళ్ళండి అని కోరింది. కానీ టోర్నమెంట్ మాత్రం పాకిస్తాన్లోనే జరుగుతుందని తేల్చి చెప్పింది.