India Team : భారత క్రికెట్ టీం త్వరలో పాకిస్థాన్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉండవచ్చు.. లేకపోవచ్చని కూడా చెప్పింది. వచ్చే ఏడాది పాకిస్థాన్లో ఆసియా కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఆస్ట్రీలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక టీమ్లు ఇప్పటికే పాకిస్థాన్లో పర్యటనను పూర్తి చేసాయి.
భారత్ క్రికెట్ టీం పాకిస్థాన్లో చివరిసారిగా 2008లో పర్యటించింది. అప్పుడు కూడా ఆసియాకప్లోనే పోటీపడింది. పాకిస్థాన్ పర్యటనకు భారత్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బీసీసీఐకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.