EPAPER

Chiranjeevi : అఖిల్ ఆశలపై నీళ్లు చల్లిన విశ్వంభర… ఎంత పని చేశావయ్య చిరంజీవి

Chiranjeevi : అఖిల్ ఆశలపై నీళ్లు చల్లిన విశ్వంభర… ఎంత పని చేశావయ్య చిరంజీవి

Chiranjeevi : సంక్రాంతికి తమ సినిమా వస్తుంది అని ముందుగా అనౌన్స్ చేసింది విశ్వంభర టీం. కానీ, రామ్ చరణ్ కోసం త్యాగం అంటూ సంక్రాంతి నుంచి తప్పుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇది చరణ్ కోసం త్యాగం కాదు.. వీఎఫ్ఎక్స్‌పై వచ్చిన ట్రోల్స్‌‌తో మళ్లీ గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారు. అందుకే వాయిదా వేశారు అంటూ మాటలు వినిపిస్తున్నా… కొడుకు సినిమా కోసం తండ్రి త్యాగం చేశాడు అనేదేే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా చిరంజీవి సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం అక్కినేని అఖిల్‌కు పెద్ద మైనస్ అయిపోయింది. చిరంజీవి సినిమా వాయిదా పడితే, అక్కినేని అఖిల్ కు ప్రాబ్లమ్ ఏంటి అని ఆలోచిస్తున్నారా…? అది ఏంటో ఇక్కడ క్లియర్ గా చూద్ధాం…


అక్కినేని అఖిల్… ఇండస్ట్రీలో నటన పరంగా మంచి ముద్ర వేసుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో. ఫ్యామిలీ సపొర్ట్‌తో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు 5 సినిమాలు చేశాడు అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మూవీ తప్పా… ఏదీ కూడా పెద్దగా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కూడా పెద్ద హిట్ ఏం కాదు.

డబ్బుల్లేవ్… 


ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ అయిపోయింది. 85 కోట్లు పెట్టి నిర్మించిన ఈ మూవీకి. 8.5 కోట్ల కలెక్షన్లు కూడా రాలేకపోయాయి. ఇదంత పక్కన పెడితే, అఖిల్‌కు ఇప్పుడు ఓ భారీ హిట్ మూవీ కావాలి. అది రాబోయే మూవీ అని తెలుస్తుంది. అఖిల్ తన 6వ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతుంది. దీన్నీ దాదాపు 100 కోట్లతో నిర్మించబోతున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఈ మూవీని నిర్మించడానికి యూవీ వాళ్ల దగ్గర కావాల్సినన్ని డబ్బులు లేవట. ఎందుకంటే… యూవీ వాళ్లు ప్రస్తుతం ఫోకస్ మొత్తం విశ్వంభర పైనే పెట్టారు. అంతే కాదు ఈ మూవీ కోసం 150 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇది అఖిల్ సినిమాపై ఎఫెక్ట్ చూపించింది.

విశ్వంభర షూటింగ్ పూర్తి అయ్యాకా… ఈ మూవీ ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తో వచ్చిన డబ్బులతో అఖిల్ మూవీని నిర్మించాలని యూవీ భావించింది. సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఆ లోపే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ తో నిర్మాతల చేతిలోకి డబ్బులు వచ్చేవి. కానీ, ఇప్పుడు విశ్వంభర వాయిదా పడింది. దీంతో నిర్మాతల చేతిలోకి డబ్బులు రాలేదు. అఖిల్ సినిమా స్టార్ట్ అవ్వలేదు.

అంతా చిరు చేతిలోనే… 

మే నెలలో విశ్వంభర మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అంటే అప్పటి వరకు అఖిల్ వెయిట్ చేయాల్సిందే. కాగా, ఇప్పటి వరకు విశ్వంభర మూవీకి ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ జరగలేదు. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై హైప్ పెరుగుతుందని, అప్పుడు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కి ఎక్కువ డబ్బులు అడగొచ్చు అని నిర్మాతలు అనుకున్నారట. కానీ, టీజర్ పై నెగిటివ్ టాక్ వచ్చింది. వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్ గా ఉన్నాయని ట్రోల్స్ వచ్చాయి. విశ్వంభర కంటే ఆదిపురుష్ బెటర్ అని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. ఈ టైంలో ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ అంటే కష్టమని, మళ్లీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేయించి.. మరో టీజర్ రిలీజ్ చేసిన తర్వాతే… ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారట.

ఇలా అన్ని పనులు అయి… నిర్మాతలకు చేతులకు డబ్బులు వచ్చేకే… అఖిల్ సినిమాకు మోక్షం వస్తుంది. అప్పటి వరకు అఖిల్ ఆగాల్సిందే.

Related News

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై ఊహించని కామెంట్.. జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య..!

Nithin : ఆ స్టార్ హీరో కోసం హీరో నితిన్ షాకింగ్ డెసిషన్ .. షాక్ లో ఫ్యాన్స్ ?

Prasanth Varma : ఏంటి .. ప్రశాంత్ వర్మ కు తెలుగులో హీరోలు కనిపించలేదా ?

Allu Arjun : మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి బన్నీ మాస్ ప్లాన్…? పుష్ప 2ను ఇలా వాడేస్తున్నాడా..?

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Big Stories

×