Pakistan vs England: పాకిస్తాన్ ( Pakistan) గాడిలో పడినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు వరుసగా ఓటములు ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు… తిరిగి పుంజుకుంది. ఇంగ్లాండ్ జట్టుపై ( England) రెండో టెస్టుల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఏకంగా 152 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. మొదటి టెస్టుల్లో రెచ్చిపోయిన ఇంగ్లాండు బ్యాటర్లను… పాకిస్తాన్ బౌలర్లు దీటుగా ఎదుర్కొని… దాదాపు 1350 రోజుల తర్వాత జట్టుకు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ( Pakistan) … 366 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 221 కి ఆల్ అవుట్ అయింది. అటు ఇంగ్లాండ్ జట్టును కూడా… తక్కువ పరుగులకు కట్టడి చేయగలిగారు పాకిస్తాన్ బౌలర్లు. ఈ తరుణంలోనే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 291 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 144 పరుగులకే ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్. దీంతో పాకిస్తాన్ ( Pakistan) 152 పరుగులుతేడాతో విజయం సాధించడం జరిగింది.
Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !
ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన సాజిద్ ఖాన్ కు ( Sajid Khan )… మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో…ప్రత్యేక విషయం ఏంటంటే… ఇద్దరు పాకిస్తాన్ బౌలర్లు ఏకంగా 20 వికెట్లు తీశారు. ఇలా ఇద్దరే.. 20 వికెట్లు తీయడం 52 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. పాకిస్తాన్ బౌలర్లు నావుమాన్ అలీ ( Noman Ali ) 11 వికెట్లు తీయగా… సాజిద్ ఖాన్ 9 వికెట్లు పడగొట్టాడు.
మొదటి ఇన్నింగ్స్ లో.. 7 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్ ( Sajid Khan )…రెండవ ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయడం జరిగింది. నౌమాన్ అలీ మొదటి ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు పడగొట్టగలిగాడు. ఇలా ఈ ఇద్దరు బౌలర్లు రెచ్చిపోవడంతో… 11 మ్యాచుల తర్వాత అలాగే 1350 రోజుల తర్వాత… సొంత గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్.