Samsung Galaxy A16 5G : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తన వినియోగదారులను ఆక్టటుకునేందుకు ఎప్పటి కప్పుడు సరికొత్త ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తుంటుంది. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ఈ మధ్య ‘ఏ’ సిరీస్లో ఫోన్లకు మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో ఫోన్ను ఆవిష్కరించింది శాంసంగ్. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ పేరిట దీన్ని యూజర్స్కు పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అప్డేట్లతో ఈ ఫోన్ను లాంఛ్ చేసింది శాంసంగ్.
ALSO READ : ఫ్లిప్కార్ట్ దివాళి సేల్.. ప్రారంభ తేదీ, డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
రెండు వేరియంట్లలో – ధర ఎంతంటే? – ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో యూజర్స్కు అందుబాటులో ఉండనుంది. 8 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ.18,999కు అందుబాటులో ఉండనుంది. అదే 8 జీబీ + 256 జీబీ వేరియంట్ అయితే రూ.20,999 కు సొంతం చేసుకోవచ్చు. మొత్తం మూడు రంగుల్లో ఇది దొరకనుంది. బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ రంగుల్లో దీన్ని తయారు చేసింది శాంసంగ్.
ఎక్కడ కొనచ్చంటే? – ప్రముఖ ఇ కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ వెబ్సైట్లతో పాటు ఇతర రిటైల్ దుకాణాల్లోనూ దీనిని కొనుగోలు చేసే వెసులు బాటు ఉంది. ఈ విషయాన్ని కంపెనీ తెలిపింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లు ఉన్నవారు, వీటిని ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 1000 రుపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్ – ఈ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లేతో వచ్చింది. 90 Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో ఇది నడుస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్తో 1 టీబీ వరకు స్టోరేజ్ కెపాసిటినీ పెంచుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.
కెమెరా ఫీచర్స్- కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే అద్భుతంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాతో పాటు , 5 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగా పిక్సల్ మ్యాక్రో లెన్స్ను అమర్చారు. అలానే ముందు వైపు సెల్ఫీలు, వీడియోల కోసం 13 మెగా పిక్సల్ కెమెరాను ఇచ్చారు.
IP 54 రేటింగ్తో దీన్ని లాంఛ్ చేశారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్లో శాంసంగ్ నాక్స్ వాల్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉండటం విశేషం. ఈ విషయాన్ని కూడా శాంసంగ్ కంపెనీనే తెలిపింది. ఇందులో ఉంజే ఎన్ఎఫ్సీ ద్వారా ట్యాప్ అండ్ పే సదుపాయం కూడా పొందొచ్చని కంపెనీ చెప్పుకొచ్చింది.
బ్యాటరీ విషయానికొస్తే 5,000 mAh బ్యాటరీ సామార్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ఇంకా ఈ మొబైల్ 25 W ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. సింగిల్ ఛార్జితోనే రెండున్నర రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని వెల్లడించింది.