Rashmika Mandanna Controversy:దక్షిణాది సినిమాల్లో స్టార్గా ఎదిగిన తర్వాత బాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టిన బ్యూటీ రష్మిక మందన్న. ఈ బ్యూటీ పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సినిమాలతో ఏమో కానీ.. వివాదాలతో అమ్మడు కాలక్షేపం చేస్తుంది. కొన్ని రోజుల ముందు కాంతార సినిమా.. తొలి సినిమా నిర్మాత విషయంలో కామెంట్స్ చేసిన ట్రోలింగ్కి గురైన క్రష్మిక.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఈసారి కూడా ఆమె సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ కారణంగా రష్మిక మందన్నపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం మిషన్ మజ్ను. జనవరి 20న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్లో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ముంబైలో అమ్మడు పాల్గొంది. ‘‘చిన్నప్పటి నుంచి నా దృష్టిలో రొమాంటిక్ సాంగ్స్ అంటే బాలీవుడ్ పాటలే. ఎన్నో పాటలు ప్రేక్షకులను అలరించాయి. దక్షిణాది పాటల్లో మాస్ మసాలా, ఐటెమ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్లో ఇదే నా తొలి రొమాంటిక్ సాంగ్. కాబట్టి చాలా ఎగ్జయిట్మెంట్తో ఎదురు చూస్తున్నారు’’ అన్నారు.
దక్షిణాది సినిమాలపై రష్మిక మందన్న చేసిన కామెంట్స్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. దక్షిణాదిలోనూ రొమాంటిక్ పాటలున్నాయి. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. నీకు సినీ రంగంలో తొలి అవకాశం ఇచ్చింది కన్నడ సినీ పరిశ్రమ, తెలుగులోకి వెళ్లారు. తర్వాత బాలీవుడ్లోకి వెళ్లారు. అక్కడ పేరు సంపాదించుకోవటం కోసం సౌత్ సినిమాలను తక్కువ చేస్తారా? అని నెటిజన్స్ రష్మికపై కామెంట్స్ రూపంలో ఫైర్ అవుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై రష్మిక ఎలాంటి వివరణ ఇచ్చుకుంటుందో చూడాలి మరి.