Rain Alert To andhra pradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు ఉందని తెలిపింది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేత.. గుప్త నిధుల కోసమేనా?
ఆంధ్రప్రదేశ్లో వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.