Redmi A4 5G : ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 లో రెడ్ మీ సరి కొత్త మొబైల్ ను ఆవిష్కరించింది. రెడ్ మీ A 4S స్మార్ట్ ఫోన్ ఆవిష్కరిస్తూ… అతి తక్కువ ధరకే ఈ ఫోన్ను అందించనున్నట్టు చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఢిల్లీ వేదికగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ సంస్థలన్నీ అత్యాధునిక ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్నాయి. ఇక ఇప్పటికే లేటెస్ట్ అప్డేట్ తో పాటు అదిరిపోయే ఫీచర్స్ తో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ ను తీసుకువచ్చిన రెడ్ మీ కంపెనీ సైతం అది తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది.
రెడ్ మీ A 4S స్మార్ట్ ఫోన్ ను రూ. 10,000 కంటే తక్కువకే అందుబాటులో తీసుకొస్తున్నామని తెలిపింది రెడ్ మీ సంస్థ. స్నాప్ డ్రాగన్ 2 చిప్ సెట్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ గా రెడ్ మీ A 4S నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే భారతీయ మార్కెట్లో ఈ మొబైల్ ను తీసుకొస్తామని… అయితే ఖచ్చితమైన తేదీని ఇప్పుడే వెల్లడించలేమని చెప్పుకొచ్చింది. ఇక అందుబాటు ధరలోనే తీసుకువస్తామని తెలిపింది.
ఈ ఈవెంట్ వో రెడ్ మీ A 4S స్మార్ట్ ఫోన్ ను బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ప్రదర్శించింది. 4mm డ్రాగన్ టు చిప్స్ తో రాబోతుందని తెలిపింది. ఇక ప్రాసెసర్ LPRDD4X తో రాబోతుందని చెప్పుకొచ్చింది.
ALSO READ : మీ ఇంట్లో వయోవృద్ధులు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా.. మరి ఈ టిప్స్ చెప్పేయండి!
ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయని తెలిపిన రెడ్ మీ కంపెనీ.. 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ను సపోర్ట్ చేస్తుందని తెలిపింది.
కెమెరా – కెమెరాను సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దామని తెలిపిన రెడ్ మీ.. డ్యూయల్ 13 ఎంపీ కెమెరాలు లేదా 25 ఎంపీ కెమెరాను సపోర్ట్ చేసే విధంగా స్మార్ట్ ఫోన్ డిజైన్ చేసినట్టు తెలిపింది. ఇక ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సైతం కలిగి ఉన్నాయని చెప్పుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ కెమెరా మ్యాడ్యులతో రాబోతుందని.. డ్యూయల్ కెమెరా ఉండబోతుందని చెప్పింది.
కనెక్టివిటీలు – ఈ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీలు సైతం గా అదిరిపోయే విధంగా ఉన్నాయని తెలిపిన రెడ్ మీ.. డ్యూయల్ బ్యాండ్, వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రాసెసర్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, జిపిఎస్, నావెల్ ఎర్త్ శాటిలైట్ సిస్టమ్ లో సపోర్ట్ చేస్తుందని తెలిపింది.
UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ను అందిస్తుందని 3.5 mm ఆడియో జాక్ ను సైతం కలిగి ఉందని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది చివర్లో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది. ఈ మొబైల్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని.. బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా నిలుస్తుందని రెడ్ మీ కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.