Minor In Custody Over Bomb Threats To Airlines: దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా పలు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మూడు రోజులుగా మొత్తంగా 19 విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముంబై నుంచి వెళ్లే ఇండిగో విమానాలను బెదిరిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివిధ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు చేసిన తనిఖీలో ఛత్తీస్ గడ్ నుంచి వాటి మూలాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మైనర్(17) ఓ వ్యాపారవేత్త కుమారుడిగా అనుమానిస్తున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. కాగా, కొన్ని విమానాలను కెనడాలోని రిమోట్ విమానాశ్రయానికి మళ్లించారు.
అయితే ఆ మైనర్ తన స్నేహితులను సైతం ఇందులో ఇరికించాలని అనుకున్నాడు. మైనర్, అతని స్నేహితులకు డబ్బు విషయంలో విభేదాలు ఉండడంతో బెదిరింపులు కూడా చేసినట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్లోని రాజ్ నంద్గావ్లో స్కూల్ మానేసిన ఈ మైనర్ తో పాటు అతడి తండ్రిని సైతం పోలీసులు పిలిపించారు.
Also Read: మరోసారి హరియాణా సీఎంగా సైనీ, ప్రధాని మోదీ సమక్షంలో రేపే ప్రమాణస్వీకారం
ఈ మేరకు విచారించిన అనంతరం మైనర్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ హోంకు తరలించగా.. ఆ బాలుడి తండ్రిని మాత్రం ఇంకా ప్రశ్నిస్తున్నారు. అయితే తన స్నేహితుడితో వివాదం ఉన్నందున అతడి పేరుతో ఎక్స్ లో ఖాతా తెరిచాడు. అనంతరం దాని నుంచి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.