Sahasa Yatra with The Corpse: బంగాళాఖాతంలో అల్పపీడనంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఓ వైపు జోరు వాన.. ఉప్పొంగుతున్న నది.. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలంటే చాలా ఇబ్బంది. నది దాటితేగానీ శవాన్ని కననం చేయలేని దుస్థితి. వంతెన లేని నదిని దాటడానికి గ్రామస్తులు, బంధువులు సాహసం చేశారు. నడుములోతు ప్రవహిస్తున్న నీటిని దాటుకొని అంత్యక్రియలు నిర్వహించారు. ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి.. అధికారులు నిర్లక్ష్యం, అలసత్వమే ఈ దుస్థితికి కారణమని అక్కడి జనాలు వాపోతున్నారు.
తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. జనాలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. ఇక సత్యవేడు నాగలాపురం మండలం సురుటుపల్లిలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో అంత్యక్రియలు చేయలేని పరిస్థితి నెలకొంది. శ్మశానానికి తరలించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. బాడీని శ్మశానానికి తరలించేందుకు పెద్ద సాహస యాత్రే చేశారు బంధువులు, స్నేహితులు.
అంత్యక్రియలు చేయాలంటే అరుణానది దాటాల్సిన పరస్థితి వచ్చింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి అంత్యక్రియలు చేశారు. శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలవను దాటుకుని అంత్యక్రియలు నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో వంతెన నిర్మాణం జరగలేదు.
Also Read: ఏపీలో సామాన్యులకు మద్యం పంట.. లిక్కర్ వ్యాపారులకు షాక్
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యం. గతంలో వంతెన నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. పేపర్పై వర్క్ మొత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ వంతెన మాత్రం పూర్తి కాలేదు.. కనీసం కూటమి సర్కారు అయిన వంతెనను పూర్తి చేయాలని.. తమ బాధను పట్టించకుని ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.