Konda Gattu temple: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
ఈ దేవాలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈవో రామకృష్ణారావు. ఈనెల 9న అన్నదానం విభాగంలో 50 కేజీల బియ్యం చోరీకి గురైంది. రైస్తోపాటు కొన్ని వస్తువులను దొంగలించారు.
దీని వెనుక అన్నదాన విభాగం జూనియర్ అసిస్టెంట్ రాములున్నట్లు అనుమానాలు వచ్చాయి. వెంటనే దేవాలయంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. అందులో రాములు ప్రమేయమున్నట్లు తేలింది. ఇందులో పాలు పంచుకున్న ముగ్గురు వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. రైస్ దొంగిలించినట్టు తేలడంతో ఉద్యోగిని అధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు.