EPAPER

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna : కొన్ని రోజుల క్రితం పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట దుమారం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే దీని ఎఫెక్ట్ కారణంగా తాజాగా రష్మిక మందన్న ఒక టాప్ పొజిషన్ ను దక్కించుకుంది. మరి ఆమె దక్కించుకున్న ఆ టాప్ పొజిషన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


సైబర్ క్రైమ్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్

తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ అనే బిరుదును దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవ్వ డం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. అలాగే రష్మిక మందన్న కూడా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అందులో తాను గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం తన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారిన సంగతిని గుర్తు చేసింది. అది సైబర్ క్రైమ్ అంటూ ఆ చేదు ఎక్స్పీరియన్స్ తర్వాత తను సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని, అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పించాలని అనుకున్నానని వెల్లడించింది. ఇక ఇప్పుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా ఈ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ‘సైబర్ నేరస్థులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. కాబట్టి మనం అలర్ట్ గా ఉంటూ వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తాను. దేశాన్ని సైబర్ క్రైమ్ నేరాల నుంచి కాపాడుతాను’ అంటూ రష్మిక మందన్న హామీ ఇచ్చారు.


రష్మిక మందన్న డీప్ ఫేక్ వివాదం

కాగా గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఏఐ ఉపయోగించి ఎడిట్ చేశారు. ఆ వీడియో చూడడానికి అభ్యంతరకరంగా ఉండడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ విషయంపై ముందుగా అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రష్మిక మందన్న ఇలాంటి వీడియోల వల్ల టెక్నాలజీ అంటేనే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా,  రష్మిక వీడియోపై పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అయ్యారు. ఇక సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఎంతోమంది సినీ, క్రీడా ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు ఎప్పటిలాగే వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Related News

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Big Stories

×