Bollywood Atul Parchure: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్య నటుడు కన్నుమూశారు.. ‘ ది కపిల్ శర్మ ‘ షో ఫేమ్ హాస్య నటుడు అతుల్ పర్చురే మరణించారు.. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.. ఆయన ఆలు హిందీ, మరాఠి సీరియల్స్ లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. టీవీ సీరియల్స్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు.. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు..
ప్రముఖ బాలీవుడ్ నటుడు హోస్ట్ గా చేస్తున్న కపిల్ శర్మ షో తో ఆయనకు ఫేమ్ పేరు వచ్చింది. ఆ షో తర్వాత వరుసగా సినిమా, సీరియల్స్ లలో నటిస్తున్నారు. అయితే ఈయన గత కొన్ని సంవత్సరాలుగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక మరాఠీ, హిందీ సినిమాలు, టీవీ షోలలో నటించారు. ఇదిలా ఉంటే ఆయన తన క్యాన్సర్ చికిత్స కారణంగా చాలా కాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, అతను మరాఠీ చిత్రం, అలీబాబా ఆని చలిషితలే చోర్లో కనిపించడంతో టెలివిజన్లోకి తిరిగి వచ్చాడు. కాగా అతని పునరాగమనం ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందరితో కలిసిమెలిసి ఉండే అతుల్ పర్చూర్ కన్నుమూశారనే వార్త తెలియాగానే ఇటు హింది, అటు మరాఠీ చలనచిత్ర పరిశ్రమ లోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఈయన తెలుగులో కూడా ఒక సినిమాలో నటించాడు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నిధి శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ సినిమాలో నటించాడు. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈయన పేరు తెలుగులో పెద్దగా ఫేమస్ కాలేదు. ఇక బాలీవుడ్ కే పరిమితం అయ్యారు. అక్కడే సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. పలు చికిత్సల తర్వాత ఆయన క్యాన్సర్ అని తేలింది. ప్రస్తుతం ఆయన మరణ వార్త విన్న సన్నిహితులు బాధ పడుతున్నారు. రేపు ఆయన స్వగృహం నందు అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం..