TGPSC Group-1 Hall Ticket 2024: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా, దీనికి సంబంధించిన హల్ టికెట్లపై అప్డేట్ ప్రకటించింది.
నేటి నుంచి గ్రూప్ -1 హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ పేర్కొంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రూప్ -1 మెయిన్స్లో మొత్తం ఆరు పేపర్లు ఉండడంతోపాటు జనరల్ ఇంగ్లిష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. దీంతో ఓవరాల్గా గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులు ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులు ఉండనున్నాయి.
జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పేపర్ గా పరిగణించగా.. అక్టోబర్ 21న ఉండనుంది. ఇక, అక్టోబర్ 22న పేపర్ 1 జనరల్ ఎస్సే, అక్టోబర్ 23 పేపర్ 2 చరిత్రచ సంస్కృతి, భూగోళశాస్త్రం, అక్టోబర్ 24న పేపర్ 3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్, అక్టోబర్ 25న పేపర్ 4లో భాగంగా ఎకానమీ, డెవలప్మెంట్, అక్టోబర్ 26న పేపర్ 5 సైన్స్, సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్, అక్టోబర్ 27న పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణంపై ఉండనుంది.
Also Read: నావల్ల కాదు, డ్రాపవుతున్నానన్న జగ్గారెడ్డి.. కారణం అదేనా?
గ్రూప్ -1 మెయిన్స్కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 3.02లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్పా మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో ఉండనుంది.