T20 World Cup 2024: మహిళల టి20 ప్రపంచ కప్ లో టీమిండియా కు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. వరుసగా గెలుస్తుందనుకుంటే… టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ ఆసీస్ రూపంలో ఎదురయింది.లీగ్ దశలో.. ఆస్ట్రేలియా జట్టు చేతిలో టీమిండియా దారుణంగా ఓటమి పాలు కావడం జరిగింది. దీంతో సెమిస్కు వెళ్లాలంటే…ఇతర జట్ల విజయం పైన ఆధారపడాల్సి…ఉంటుంది.
ఆదివారం రోజున… మహిళల టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య… షార్జా వేదికగా..మ్యాచ్ జరిగింది.అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు…20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని టీం ఇండియా చేదించడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 142 పరుగులు చేసింది టీమిండియా.
Also Read: Ind Vs Nz: న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్ గా అతడికి చాన్స్!
ఈ తరుణంలోనే తొమ్మిది పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో సెమిస్ ఆశలు టీమిండియా కు కష్టతరంగా మారాయి. టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన 6 పరువులు చేసి మళ్లీ విమర్శల పాలు అయ్యారు. అటు హర్మన్ ప్రీత్ కౌర్ 54 పరుగులు చేసిన కూడా…ఆమెపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఆమె స్లోగా ఆడటం వల్ల మ్యాచ్ ఓడిపోయామని చెబుతున్నారు.
Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !
కానీ హర్మన్ ప్రీత్ సింగ్ , దీప్తి శర్మ తప్ప… టీమిండియా బ్యాటర్లలో ఎవరూ రాణించలేదు. దీంతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే… ఇవాళ జరిగే పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ టీమ్ ఇండియా భవితాన్ని తేల్చనుంది. ఇందులో న్యూజిలాండ్ గెలిస్తే టీమిండియా ఇంటికి వెళ్లినట్లే అని చెబుతున్నారు. అదే న్యూజిలాండ్ జట్టును పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిస్తే.. టీమిండియా సెమీస్కు వెళుతుంది.