Palle Panduga starts from today onwords: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దాదాపు 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.
అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు.
Also Read: వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించగా.. సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.