EPAPER

OTT Movie : అబ్బాయిల స్పర్శ కోసం అల్లాడిపోయే అమ్మాయి… పిచ్చెక్కించే బో*ల్డ్ కథ

OTT Movie : అబ్బాయిల స్పర్శ కోసం అల్లాడిపోయే అమ్మాయి… పిచ్చెక్కించే బో*ల్డ్ కథ

OTT Movie : మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు బో*ల్డ్ టచ్ ఇస్తే వచ్చే కిక్కే వేరప్ప అన్నట్టుగా ఉంటాయి ఈ జానర్ సినిమాలు. ఇక అందులోనూ బో*ల్డ్ సినిమాలతో కిక్కెక్కించే హీరోయిన్ ఇలాంటి సినిమాలో భాగమైతే ఇక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఓ తెలుగు హీరోయిన్ నటించిన బో*ల్డ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. మరి ఈ సినిమా పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన సినిమా గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించగా, గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. డిసెంబర్లోనే ఓటిటిలో ఒకేసారి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ వచ్చేసింది. కానీ తాజాగా ఈ సినిమా జియో సినిమా అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు థియేటర్లోకి వచ్చిన 11 నెలల తర్వాత ఈ సినిమా హిందీ వర్షన్ అందుబాటులోకి రావడం విశేషం. గత ఏడాది డిసెంబర్ 26న తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. కొన్ని వారాల పాటు ట్రెండింగ్ లో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం. అక్టోబర్ 13 నుంచి ఈ సినిమా హిందీ వర్షన్ జియో ఓటిటిలోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ మరేదో కాదు మంగళవారం.


కథలోకి వెళ్తే…

సినిమాలో మహాలక్ష్మి పురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ గ్రామంతో పాటు వారంలో రెండవ రోజైనా మంగళవారం సెంటిమెంట్ తో సినిమా మొత్తం సాగుతుంది. ఈ ఊర్లో విచిత్రంగా ప్రతి మంగళవారం ఎవరో ఒకరు చనిపోతుంటారు. పైగా చనిపోయిన వారికి సంబంధించిన ఎఫైర్స్ గురించి ఎవరో గోడ మీద రాస్తున్నందుకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని గ్రామస్తులు అనుకుంటారు. కానీ ఎస్ఐ మాయ రంగంలోకి దిగి అది ఆత్మహత్య కాదు హత్య అని చెబుతుంది. అసలు ఈ చావులకు నిజమైన కారణమేంటి? అవి హత్యలా లేక ఆత్మహత్యలా ? ఆ గోడలపై ఎఫైర్స్ గురించి రాస్తున్నది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. సినిమాకు పాయల్ రాజ్ పుత్ ఎంత ప్లస్ పాయింట్ అయిందో, అజినీష్ లోక్నాథ్ సంగీతం కూడా అంతకంటే ఎక్కువగా ప్లస్ పాయింట్.. ముఖ్యంగా ఆయన అందించిన బీజీఎంలో తెగ పాపులర్ అయ్యాయి. 2023 నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా దాదాపు 23 కోట్ల కలెక్షన్లు కొల్లబట్టి హిట్ అనిపించుకుంది. ఒకవేళ ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ చూడాలనుకుంటే ఇప్పుడు జియో సినిమాలో చూడొచ్చు.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 25 సినిమాలు.. ఆ రెండు సినిమాలను తప్పకుండా చూడాలి..

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ అబ్బాయి నుంచి కాల్… క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : సినిమాలో ఛాన్స్ ఇస్తానని తీసుకెళ్లి ఇంత అరాచకమా? బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రైమ్ థ్రిల్లర్

Mangalavaram : పాయల్ మూవీకి తగ్గని క్రేజ్.. మరోసారి అక్కడ రిలీజ్..

Jigra OTT: ఓటీటీలోకి ‘జిగ్రా’ మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×