Telangana Job Portal : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వికలాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్’ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్’ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.
ఈ క్రమంలోనే vikalangulajobportal.telangana.gov.in పోర్టల్’లో నిరుద్యోగ వికలాంగులు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ప్రైవేట్ కంపెనీల్లో చదువుకు తగిన కొలువులు సాధించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. Youth4 Jobs అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ ఆన్లైన్ పోర్టల్ ను సర్కారు రూపొందించింది.
Also read : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ