RSS Kerala: కమ్యూనిస్టు కోట కేరళను బీజేపీ టార్గెట్ చేసిందా? ఇప్పటికే బెంగాల్లో ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా? నెక్ట్స్ టార్గెట్ కేరళ వైపు చూస్తుందా? కేరళలో ఆర్ఎస్ఎస్ జోరు పెంచిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కమ్యూనిస్టులకు కంచుకోట బెంగాల్ తర్వాత కేరళ. బెంగాల్లో కమ్యూనిస్టులు చివర దశకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుపటి మాదిరిగా అక్కడ కమ్యూనిస్టులు ఫైట్ చేయలేక పోతున్నారని అంటున్నారు. పార్టీ నుంచి సరైన సహకారం కార్యకర్తలకు కరువైంది. దీంతో కేడర్ చేజారితోంది.
లేటెస్ట్గా కేరళపై బీజేపీ కన్నేసిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా కేరళలో కమ్యూనిస్టులు లేదా కాంగ్రెస్ పార్టీలు మాత్రమే రూలింగ్ చేసేవి. దశాబ్ద కాలంగా కమ్యూనిస్టుల సీనియర్లు యాక్టివ్గా లేకపోవడంతో దాన్ని భర్తీ చేసే పనిలో పడింది ఆర్ఎస్ఎస్.
ఇందులో భాగంగా కేరళ చరిత్రలో తొలిసారి కమ్యూనిస్టుల కోటలోకి ఆర్ఎస్ఎస్ వింగ్ అడుగు పెట్టేసింది. కేరళలోని కన్నూర్లోని కల్యాస్సేరి ప్రాంతంలో అడుగు పెట్టింది. ఏకంగా కవాతు నిర్వహించింది.
ALSO READ: ఉద్యోగులకు ఆ ఐటీ కంపెనీ దసరా గిఫ్ట్, కార్లు, బైక్లతోపాటు..
నార్మల్గా కమ్యూనిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మిగతా పార్టీల నాయకులు అడుగుపెట్టేందుకు సాహసం చేయరు. కమ్యూనిస్టులకు అడ్డాగా మారిన కల్యాస్సేరిలో ఆర్ఎస్ఎస్ కవాతు చేయడంతో ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల్లో చర్చ మొదలైపోయింది.
బెంగాల్ మాదిరిగానే కేరళలోనూ కమ్యూనిస్టులకు-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఏదోవిధంగా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. హత్యలు జరిగిన ఘటనలు లేకపోలేదు. రీసెంట్గా ఇలాంటి ఘటనలో న్యాయస్థానం నిందితులకు జైలు శిక్ష విధించిన విషయం తెల్సిందే.
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కవాతుపై కేరళ రాజకీయ పార్టీల్లో అప్పుడు చర్చ మొదలైంది. బీజేపీ ధాటిని ఏ పార్టీ బలైపోతుందని అనుకుంటున్నారు.
First time in the history, RSS pathasanchalan in CPM party village in Kalyasseri, Kannur, Kerala !pic.twitter.com/EQgDYz74Rv
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 13, 2024