Abhishek Bachhan- aiswarya Rai : మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లలో అభిషేక్, ఐశ్వర్య రాయ్ జంట కూడా ఒకటి.. వీరిద్దరినీ స్క్రీన్ మీద చూసి చాలా రోజులు అయ్యింది. ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తుంది. కానీ అందులో నిజమేంత ఉందో తెలియదు.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది. వీరిద్దరూ విడాకుల వరకు వెళ్ళడానికి ఒక హీరోయిన్ కారణం అంటూ ఓ న్యూస్ వినిపిస్తుంది. అసలు ఆ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇండస్ట్రీలో ప్రస్తుతం లవ్ ఎఫైర్స్, బ్రేకప్ చాలా కామన్ గా మారిపోయాయి. వివాహం చేసుకొని ఎంతో కాలం అన్యోన్యంగా ఉన్న జంట.. సడన్గా డివోర్స్ తీసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. మొన్న ధనుష్, ఐశ్వర్యలు తమ కాపురాన్ని విడాకులు తీసుకొని ముక్కలు చేసుకున్నారు. ఈ వార్తలు విని చాలా మంది షాక్ అయ్యారు. అయితే మొదటి నుంచి స్టార్ సెలబ్రిటీగా ఉన్నవారు.. వివాదాలు ఏర్పడిన తర్వాత సోషల్ మీడియా వేదికపై ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడం.. పబ్లిక్ అపీరియన్స్ను తగ్గించడం.. ఎవరికి వారు ఒంటరిగా బయట కనిపించడం చేస్తారు. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఇప్పటివరకు విడాకులు తీసుకున్న జంటలు ఇలానే చేస్తున్నారు..
అభిషేక్ ఫ్యామిలీ ఫొటోస్ లో ఐశ్వర్య, తన కూతురు ఉండడం లేదు. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యరాయ్ కి మధ్యన వివాదాలు నెలకొన్నాయంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక రెడీట్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడేమో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకోవడానికి కారణం ఒక హీరోయిన్ అనే వార్త వైరల్ గా మారింది. వీరిద్దరు లీగల్గా డివోర్స్ తీసుకోవాలనుకోవడం లేదని సమాచారం. అయితే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. అనుకుంటున్నారా.. దస్వి సినిమా షూట్ టైం లో అభిషేక్తో కలిసి నటించిన నిమ్రత కౌర్ అట. అదే కారణంతోనే దూరంగా ఉంటున్నారని సమాచారం.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.. ఇక ఈ మధ్య ఈ జంట ఎప్పుడూ కలిసి కనిపించలేదు. దాంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.. అంతేకాదు ప్రతి చోట వేరు వేరుగా రావడం వెళ్లడం చెయ్యడంతో ఈ వార్తలు ఎక్కువ అయ్యాయి. ఈ విషయం పై మరో క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..