Good Days:సిద్ధి వినాయకస్వామిని స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సమయంలో పెరుగన్నం నైవేద్యంగా చేసి తిన్నా-దానం చేసినా మీ ఇంట్లో ప్రశాంతత, శాంతి, సంతోషం నెలకొంటాయని పండితులు అంటున్నారు. అలాగే అమావాస్య రోజు, మహాలయ పక్షాల సమయంలో పెరుగన్నం దానం చేస్తే అన్ని పితృశాపాలు తొలగిపోతాయి. అలాగే కులదేవతలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సుఖసంతోషాలు
కలుగుతాయి. శనివారం రోజు కులదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అప్పుల బాధల నుంచి విముక్తి చెందుతారు. పెరుగు అన్నాన్ని దానిమ్మ పండు గింజలను కలిపి కులదేవతలకు నైవేద్యం చేసి, దానం చేస్తే శత్రువుల బాధ తొలగిపోతుంది. శుక్రవారం, శనివారం సాయంత్రం పూట మాత్రమే ఇలా పెరుగు అన్నాన్ని స్వీకరించాలి
శనివారం రోజు స్టీలు పళ్లెంలో అరటి ఆకు ఉంచి పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలంతో కలిపి దానం చేస్తే ఎముకల సమస్యలతోపాటు అన్ని రకాల మోకాళ్ల నొప్పులు త్వరగా నయమవుతాయి. శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీదేవికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ధన వృద్ధి కలుగుతుంది.. శ్రావణ శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజను చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంతో పెరుగన్నాన్ని దానం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి రాక పుంజుకుంటుందని పురోహితులు అంటున్నారు.
ఆషాడమాసంలో కూడా అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. ముందు రోజే అన్నంలో పాలు పోసి పెరుగు తోడంటు వేసి ఉదయం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి. పూజ చేసిన తర్వాత ఆ అన్నాన్ని ఇంటి యజమాని తిని ఇంటి చాకలి కూడా ఇస్తుంటారు. అలా చేయడం వల్ల కడుపు చలువ అంటారు. అది కూడా ఆదివారమే చేయాలి. దీని వల్ల సంతానం చల్లగా ఉంటారు. కలకాలం ఆరోగ్యంగా ఉంటారు.