Ind Vs Nz: టీమిండియా మంచి జోష్ లో కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు పైన టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా… టి20 లపై ఫోకస్ చేసింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా… ఇవాళ నామమాత్రపు టి20 హైదరాబాదులో ఆడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలక మండలి.
న్యూజిలాండ్ తో ఏకంగా మూడు టెస్టులు మ్యాచులు ఆడనుంది టీమిండియా. అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ మూడు టెస్ట్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. దీనికోసం తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. ఆడే జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మ్యాచ్ లకు… రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… వైస్ కెప్టెన్ గా బుమ్రా ను తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ పాలకమండలి.
న్యూజిలాండ్ సిరీస్ కోసం భారత టెస్టు జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికెట్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్)
రిజర్వ్ బెంచ్ : హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ