Cricketer Siraj Reports for Duty as DSP in Telangana: హైదరాబాదీ టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్ కు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !
తాజాగా సిరాజ్ కు డిఎస్పీ పోస్టును కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపి జితేందర్ సిరాజ్ కు డిఎస్పీ నియామక పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్జాతీయ క్రికెట్ భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తీసుకువచ్చాడంటూ మహమ్మద్ సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
టీ20 వరల్డ్ కప్ ను గెలిచిన అనంతరం హైదరాబాద్ కు చెందిన సిరాజ్ మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సిరాజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు.