Sankranti Trains: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. అంతా సొంతూళ్లకి వెళ్లిపోతుంటారు. సొంత వాహనాలు ఉన్నవాళ్లైతే ఓకే.. లేదంటే బస్సులు, రైళ్లలోనే వెళ్తుంటారు. అసలే సంక్రాంతి. బస్సులు దొరకుతాయా? ట్రైన్లలో కాలు పెట్టేంత సందు అయినా ఉంటుందా? ఏటేటా ఆ రద్దీ మరింత పెరుగుతూనే ఉంది. పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంటుంది. రైల్వే శాఖ కూడా స్పెషల్ ట్రైన్స్ వేస్తుంది. అయినా, రద్దీ రద్దీనే. తోపులాట తోపులాటే.
ఈసారి కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి 20 వరకు వివిధ స్టేషన్ల మధ్య మొత్తం 94 స్పెషల్ ట్రైన్స్ నరపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో రిజర్వ్ కోచ్లు, అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాల జాబితా రిలీజ్ చేసింది.