Team India and Bangladesh have reached Hyderabad for the third T20 match: టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. మూడో టి20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్నాయి టీమిండియా అలాగే బంగ్లాదేశ్. గురువారం రోజు రాత్రిపూట శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది టీం ఇండియా. టీమిండియా తో పాటు బంగ్లాదేశ్ టీం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా టీం ఇండియా ప్లేయర్లకు… ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ వద్ద భారీ వెల్కమ్ చెప్పారు. అయితే ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా హోటల్ కు రెండు జట్టు వెళ్లిపోయాయి.
బంగ్లాదేశ్ జట్టుకు తాజ్ కృష్ణ హోటల్ లో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటు టీమిండియా జట్టు పార్క్ హయత్ హోటల్లో ఉండనుంది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బస్సులో… హోటళ్లకు వెళ్లిపోయాయి ఈ రెండు జట్లు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే… రెండు టి20 మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.
Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !
దసరా రోజున అంటే శనివారం రోజున… టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఇది ఉప్పల్ వేదికగా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా కు నామమాత్రంగా జరగనుంది. కానీ బంగ్లాదేశ్ మాత్రం చివరి మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే.. టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ జట్లు హైదరాబాద్ చేరుకున్న వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
https://x.com/bigtvtelugu/status/1844385519607717966
https://x.com/bigtvtelugu/status/1844385519607717966