EPAPER

Bigg Boss 8 Telugu: సీత దొంగతనం.. ఇంత సైలెంట్‌గా ఎలా చేసింది భయ్యా? మరి మెగా చీఫ్ ఏం చేస్తున్నాడో!

Bigg Boss 8 Telugu: సీత దొంగతనం.. ఇంత సైలెంట్‌గా ఎలా చేసింది భయ్యా? మరి మెగా చీఫ్ ఏం చేస్తున్నాడో!

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో బీబీ హోటల్ అనే టాస్క్ మొదలయ్యింది. అందులో పాత కంటెస్టెంట్స్ అయిన ఓజీ టీమ్.. హోటల్ స్టాఫ్‌గా, కొత్త కంటెస్టెంట్స్ అయిన రాయల్స్ టీమ్.. గెస్టులుగా నటించాలి. ఇది ప్రతీ సీజన్‌లో జరిగే టాస్కే అయినా ఈ సీజన్‌లో కొత్తగా ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నించి ఘోరంగా ఫెయిల్ అయ్యారు కంటెస్టెంట్స్. రెండు రోజులు జరిగిన ఈ టాస్క్‌లో మధ్యలో పాత్రలు తారుమారు అయ్యాయి. మొదటి రోజు పూర్తవ్వగానే క్యారెక్టర్స్‌ను మార్చాడు బిగ్ బాస్. అయినా ఏ పాత్రలకు కూడా అందరూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారు. ఇంతలోనే సీత చేసిన దొంగతనం హైలెట్‌గా నిలిచింది.


యష్మీ ఎంటర్‌టైన్మెంట్

గెస్టులుగా నటిస్తున్న రాయల్స్ టీమ్‌కు మాత్రమే డబ్బులను ఇచ్చాడు బిగ్ బాస్. అందులో ఉన్న ఎనిమిది మందికి సెపరేట్‌గా డబ్బులను పంపించాడు. గెస్టులుగా వచ్చిన వారిని ఇంప్రెస్ చేసి వారి దగ్గర ఉన్న డబ్బులతో పాటు స్టార్లను కూడా సంపాదించుకోవడం హోటల్ స్టాఫ్ బాధ్యత. అందుకే హోటల్ స్టాఫ్ అంతా ఎవరి ప్రయత్నం వారు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా హౌస్ కీపర్ పాత్రలో యష్మీ అదరగొట్టేసింది. ఎవరికి ఏం కావాలన్నా అందుబాటులో ఉంటూ.. వారిని ఎంటర్‌టైన్ చేస్తూ వారి దగ్గర నుండి డబ్బులు కొట్టేసింది. అంతే కాకుండా తన పర్ఫార్మెన్స్ నచ్చి స్టార్ కూడా ఇచ్చాడు అవినాష్. మణికంఠ, నబీల్, సీత పర్ఫార్మెన్స్‌లకు కూడా స్టార్లు దక్కాయి.


Also Read: వామ్మో.. నైనిక లిస్ట్ లో ఇంతమంది బలి అయ్యారా? వెలుగులోకి ఒక్కొక్కటి..

అందరూ స్టార్సే

ఒకవైపు బీబీ హోటల్ టాస్క్ జరుగుతుండగానే మరోవైపు మరో రెండు టాస్కులు కూడా జరిగాయి. ఓజీ టీమ్‌లో బలమెంత ఉందో తెలుసుకోవడం కోసం టెస్ట్ పెట్టమన్నారు బిగ్ బాస్. అందుకే రాయల్స్ టీమ్ అంతా కలిసి వారితో తోచిన ఆటలను ఆడించారు. ఒక్కొక్క ఆట పూర్తయిన తర్వాత ఆ టీమ్ నుండి ఓడిపోయిన ఇద్దరు కంటెస్టెంట్స్ ఈ ఆట నుండి తప్పుకోవాలి. అలా చివర్లో నిఖిల్, మణికంఠ పోటీలో మిగిలారు. స్విమ్మింగ్ పూల్ నుండి స్పూన్స్ తీసే టాస్క్‌లో నిఖిల్ చురుగ్గా ఆడి స్టార్ గెలుచుకున్నాడు. కానీ మణికంఠ కూడా కష్టపడడంతో తనకు కూడా స్టార్ ఇచ్చింది రోహిణి. ఆ తర్వాత జరిగిన ‘సేవ్ ది వాటర్’ టాస్క్‌తో విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యింది.

మెగా చీఫ్ బాధ్యత

‘సేవ్ ది వాటర్’ టాస్క్ ఓజీ టీమ్ గెలవడంతో వారికి రూ.25 వేలు దక్కాయి. దీంతో వారే విన్నర్ అవుతారేమో అనుకున్నారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ బయటపడింది. డబ్బులు గెస్ట్‌ల చేతికి రాకముందే హరితేజ బ్యాగ్‌లో నుండి కొంత డబ్బును దొంగతనం చేసింది సీత. ఆ విషయం ఓజీ టీమ్‌లో కూడా ఎవరికీ తెలియదు. మొత్తానికి ఆ విషయం బయటపడింది. సీతే ముందుకొచ్చి ఆ విషయాన్ని ఒప్పుకుంది. కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని చెప్పింది. నబీల్ మెగా చీఫ్ కావడంతో రాయల్స్ టీమ్ అంతా కలిసి సీత ప్రవర్తనపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సీత.. తన టీమ్ కాబట్టి తను ఏం తప్పు చేసినా మెగా చీఫ్‌గా తానే సమాధానం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సీతను ఆ డబ్బు తిరిగి ఇచ్చేసేలా ఒప్పించాడు. అలా రాయల్స్ టీమ్.. బీబీ హోటల్ టాస్క్‌లో విన్ అయ్యింది.

Related News

Bigg Boss: దొంగగా మారిన స్ట్రాంగ్ కంటెస్టెంట్.. కంటెస్టెంట్స్ మదిలో గుబులు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో రివర్స్ అయిన ఓటింగ్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు?

Bigg Boss 8 Telugu: రూటు మార్చిన పృథ్వి.. విష్ణుప్రియా వద్దు, ఆ పిల్లే ముద్దు!

Bigg Boss Nayani Pavani : బిగ్ బాస్ నయని అసలు పేరు ఇదా.. ఎందుకు మార్చుకుందంటే?

Bigg Boss 8 Telugu Promo: వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తారా..? పాపం టెస్టీ తేజా..

Bigg Boss 8: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మిస్ ఫైర్.. ఇక ఎవరూ కాపాడలేరు..

Big Stories

×