Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అయినప్పటి నుండి ప్రతీ సీజన్లో ఏదో ఒక లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుండేది. కొన్ని సీజన్స్లో అయితే ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలే నడిచాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో మొదటి వారం పూర్తయ్యే సమయానికి నిఖిల్, సోనియా లవ్ ట్రాక్.. అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అనుకున్నారు. కానీ సోనియా.. పృథ్వితో కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నారు. ఇంతలోనే సోనియా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. ఇప్పుడు అసలు హౌస్లో ఏది లవ్ ట్రాక్ అనుకోవాలో ప్రేక్షకులు కూడా తెలుసుకోనేంత కన్ఫ్యూజన్లో ఉన్నారు.
లిమిట్స్ దాటేసింది
సోనియా వెళ్లిపోయిన తర్వాత మాత్రమే కాదు.. ఉన్నప్పుడు కూడా పృథ్విపై ప్రేమ చూపించింది విష్ణుప్రియా. తను వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రేమ మరింత ముదిరిపోయింది. అయితే సోనియా వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానంలో యష్మీ వచ్చినట్టుగా ఉందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. ఎందుకంటే సోనియాలాగానే యష్మీ కూడా అటు నిఖిల్తో, ఇటు పృథ్వితో క్లోజ్గా ఉంటూ కొంచెం ఓవర్ చేసినట్టుగా అనిపించింది. అయినా కూడా విష్ణుప్రియా మాత్రం పృథ్విని వదల్లేదు. పృథ్వి మాత్రం ముందు నుండి విష్ణుప్రియాతో లిమిట్స్లోనే ఉంటున్నా తన ప్రవర్తన రోజురోజుకీ చిరాకు వచ్చేలా చేస్తోంది. అందుకే పృథ్వి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో పులిహోర కలపడం మొదలుపెట్టాడు.
Also Read: వామ్మో.. నైనిక లిస్ట్ లో ఇంతమంది బలి అయ్యారా? వెలుగులోకి ఒక్కొక్కటి..
క్యారెక్టర్స్ మారాయి
బిగ్ బాస్ 8లోకి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. అందులో గ్లామర్ డాల్గా కనిపించడానికే వచ్చినట్టుగా ఉంది నయని పావని. బీబీ హోటల్ టాస్క్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేంత రేంజ్లో తన క్యారెక్టర్ లేదు. ముందుగా బీబీ హోటల్ టాస్క్ ప్రారంభం అవ్వగానే గంగవ్వ మహారాణి పాత్రలో కనిపించగా.. తన అసిస్టెంట్గా నయని పావని నటించాల్సి వచ్చింది. కానీ ఈ టాస్క్ మధ్యలోనే కొన్ని మార్పులు చేశారు బిగ్ బాస్. ఆ మార్పుల వల్ల నయని పావని.. గౌతమ్కు గర్ల్ఫ్రెండ్గా నటించాల్సి వచ్చింది. కానీ ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం తను గౌతమ్ గర్ల్ఫ్రెండా? పృథ్వి గర్ల్ఫ్రెండా అనే డౌట్ వచ్చింది.
ప్రేమ పావురాలు
బీబీ హోటల్ టాస్క్లో గౌతమ్ గర్ల్ఫ్రెండ్గా నటించమని నయని పావనికి చెప్తూ.. తను పృథ్వికి గర్ల్ఫ్రెండ్గా నటించడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి ఒకే స్ట్రాతో కొబ్బిరిబోండం కూడా తాగారు. ఇదంతా దూరం నుండి గమనిస్తూనే ఉంది విష్ణుప్రియా. పృథ్వి ఫోకస్ అంతా తనపైనే ఉందని విష్ణుకు కూడా అర్థమయ్యింది. అందుకే వచ్చి నేరుగా అడిగేసింది. నయని పావని అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందా అని విష్ణుప్రియా అడగగానే పాజిటివ్ రియాక్షన్ ఇచ్చాడు పృథ్వి. అది అర్థమయిన విష్ణు.. ఒక చాక్లెట్ ఇచ్చి తననే ప్రేమించమని పృథ్విని అడిగింది. పృథ్వి.. నయని పావని వెంటపడడం, విష్ణుప్రియా.. పృథ్వి వెంటపడడం.. అలా హౌస్లో మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొదలుకానుందా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది.