హైదరాబాద్, స్వేచ్ఛ: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏపీలో 3 రోజులపాటు వానలు ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో ఓవైపు బతుకమ్మ సంబురాల వేళ వరుణుడు అక్కడక్కడ కరుణించడంతో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ వాసులను వాన జల్లులు పలుకరించాయి. దీంతో వాతావరణం కూల్గా మారి ఆహ్లాదకరంగా మారింది. మలక్ పేట, నారాయణగూడ, కొత్తపేట, హిమాయత్ నగర్, అబిడ్స్ కోఠి, బషీర్ బాగ్ ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దిల్ సుఖ్ నగర్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, షేక్ పేట, తదితర ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు కనిపించాయి.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..