Brs Mla Mallareddy Interesting Comments On Chandrababu And Kishan Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తన మనమరాలు వివాహ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు మల్లారెడ్డి.
30 ఏళ్ల పరిచయం :
ఈ సందర్భంగా మల్లారెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తనకు గత 30 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అందుకే తన మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానని మీడియాతో చెప్పారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..
రాజకీయ భిక్ష పెట్టారు :
ప్రస్తుతం రాజకీయ అంశాలేమీ చర్చకు రాలేదన్న మల్లారెడ్డి, ప్రతిసారి అవే ముచ్చట్లు కావాలా అని పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు. ఇక టీడీపీలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, తనకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. ఆయన దయవల్ల తాను ఎంపీగా దిల్లీ వెళ్లానన్నారు. ఆనాడు తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఫలితంగానే పార్లమెంట్ కు ఎన్నికయ్యాయని మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు.