హైదరాబాద్, స్వేచ్ఛ: వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సమీకరణపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి అప్పుల భారం పెరిగిందని, ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలోనే అధికారులతో వరుస భేటీలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి భట్టి, పలు శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖాజానాకు ఆదాయం పెంచేందుకు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. లీకేజీలను అరికడుతూ, ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని చెప్పారు. అక్రమ మద్యం, ఇసుక అమ్మకాలు, పన్నుల ఎగవేతను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: భర్తీ మాది.. క్రెడిట్ మీకా.. ? ప్రభుత్వంపై వినోద్ కుమార్ ఫైర్