Sushant Singh Rajput: బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని రెండేళ్లు దాటేసింది. ఇప్పటికీ ఆయనది హత్య.. ఆత్మహత్య అని తేలలేదు. కేసు మాత్రం సీబీఐ చేతికి వెళ్లింది. ఇలాంటి తరుణంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ పోస్ట్ మార్టమ్లో పాల్గొన్న సిబ్బంది చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో కలకలంగా మారాయి. సుశాంత్ పోస్ట్ మార్టమ్లో పాల్గొన్న సిబ్బంది రూప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘సుశాంత్ సింగ్ చనిపోయిన రోజు ఆయన శవం మా హాస్పిటల్కి వచ్చింది. ఆయన శరీరం, మెడపై గాయాలు కనిపించాయి. వీడియో తీయాల్సిన మేం.. అధికారుల ఆదేశాల ప్రకారం ఫొటోలు మాత్రమే తీసి పంపాం.
సుశాంత్ బాడీని చూడగానే అది ఆత్మహత్య కాదని.. హత్య అని అర్థమైంది. వెంటనే డెడ్ బాడీని పోలీసులకు అప్పచెప్పాలని ఆదేశించటంతో మేం అధికారుల ఆదేశాలను పాటించాం. అదే రోజు రాత్రి పోస్ట్ మార్టమ్ పూర్తి చేశాం’ అన్నారు. రూప్ కుమార్. దీంతో సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్, మర్డర్డ్ అనే హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. మరిప్పుడు ఈ వార్తలు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.