India vs Bangladesh 2nd T20I Nitish Kumar Reddy half century 74 runs in 34 balls: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితేఈ మ్యాచ్ లో 86 పరుగులు తీయడాతో బంగ్లాదేశ్ జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో… తిరుగులేని విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా…. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 221 పరుగులు చేసింది. ఇందులో నితీష్ కుమార్ రెడ్డి 74 పరుగులు చేశాడు. ఏడు సిక్స్ లు నాలుగు ఫోర్ లతో దుమ్ము లేపాడు.
Also Read: Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!
అటు ఒక 53 పరుగులతో…. బంగ్లాదేశ్ జట్టుకు చుక్కలు చూపించాడు. దీంతో 20 ఓవర్లలోనే 221 పరుగులు చేసింది టీమిండియా. అయితే ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు చేదించడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 135 పరుగులకు 9 వికెట్లు నష్టపోయి…ఓడిపోయింది బంగ్లాదేశ్. ఇక టీమిండియా బౌలర్లలో నితీష్ కుమార్ కు రెండు వికెట్లు అలాగే వరుణ్ చక్రవర్తికి రెండు వికెట్లు పడ్డాయి.మిగతా బౌలర్లు అందరూ… తలో వికెట్ పడగొట్టారు.
Also Read: IPL 2025: SRH లో కల్లోలం..ఆ డేంజర్ ప్లేయర్ ఔట్ ?
అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడానికి…ఐదు కారణాలు ఉన్నాయి. ఇందులో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే గంభీర్ కోచ్ గా తన పనిని సక్రమంగా… చేసి అందరితో బౌలింగ్ చేయిస్తున్నాడు.ఇక బ్యాటర్లందరూ విఫలమైనా నితీష్ కుమార్ రెడ్డి అలాగే రింకు సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమ్ ఇండియా గెలిచింది. అలాగే బౌలర్లలో… మంచి పోటీ తత్వం కనిపిస్తోంది. అది కూడా టీం ఇండియాకు ప్లస్ కావడం మనం చూసాం.ముఖ్యంగా… టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ జరిగింది.ఇక బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చివరి t20…హైదరాబాదులో జరగనుంది.