Tollywood Remake: బాలీవుడ్ ఇండస్ట్రీని ఇప్పుడు టాలీవుడ్ క్రాస్ చేసేసింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనుకునే రోజులు పోయాయి. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం మన టాలీవుడ్ సినిమాలపై ఆసక్తిని చూపుతున్నారు. అలా ఆసక్తి చూపే హీరోల్లో రణ్వీర్ సింగ్ ఒకరు. ఇప్పటికే ఆయన టెంపర్ సినిమా రీమేక్లో నటించిన సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో అన్నియన్ రీమేక్లో నటిస్తారనే ప్రకటన వచ్చింది. కానీ ఇప్పుడు ఆ మూవీ స్థానంలో శంకర్ దర్శకుడిగా రణ్వీర్ సింగ్ మరో సినిమా చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
కాగా.. రణ్వీర్ సింగ్ ఇప్పుడు మరో తెలుగు సినిమా రీమేక్లో నటించటానికి ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. క్రాక్. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటున్నారట. రీసెంట్గా గోపీచంద్ మలినేని.. రణ్వీర్ను కలిసి క్రాక్ స్క్రిప్ట్ను వినిపించారట. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారని కూడా అంటున్నారు. మైత్రీ మూవీ సంస్థనే ఈ సినిమాను రూపొందించే అవకాశాలున్నాయంటున్నారు మరి. దీనిపై గోపీచంద్ మలినేని ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.