Naga Chaitanya Twitter: ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ.. వీరి గురించే చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ పెట్టిన చిచ్చు వల్ల అటు రాజకీయాల్లో, ఇటు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై కేవలం వీరిద్దరూ మాత్రమే కాదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం రియాక్ట్ అయ్యింది. వీరికి సపోర్ట్ చేయడం కోసం ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య.. కొండా సురేఖపై పరువునష్టం దావా వేసి కోర్టుకు కూడా వెళ్లారు. ఇంతలోనే నాగచైతన్య చేసిన ట్విటర్ పోస్ట్.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కొండా సురేఖ వివాదం
నాగచైతన్య, సమంత అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి ఆ తర్వాత చట్టపరంగా విడిపోయారు కూడా. ఇన్నేళ్ల తర్వాత నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడం కోసం సమంతను తన దగ్గరకు పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారని, అందుకే విడాకులు అయ్యాయని కొండా సురేఖ ఆరోపించారు. దీంతో నాగార్జున సీరియస్ అయ్యారు. దానిపై నాగచైతన్య కూడా ట్విటర్లో రియాక్ట్ అయ్యాడు. ఈ విషయం ఇంకా ప్రేక్షకులు మర్చిపోక ముందే చైతూ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?
ఫ్రీగా ఇస్తా
‘‘నేను 2013లో 50 డాలర్లు పెట్టి 100 బీటీసీ కొన్నాను. ఇప్పుడు దాని విలువ 6 మిలియన్ డాలర్లు. దానిని నేను ఫ్రీగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు?’’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఒకవైపు తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా.. మరోవైపు నాగచైతన్య సంబంధం లేకుండా ఇలా ట్వీట్ చేయడమేంటి అని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని భావిస్తున్నారు. హ్యాక్ అవ్వకుండా చైతూ.. ఇలాంటి సమయంలో ఇలా సంబంధం లేని ఫన్నీ ట్వీట్ చేయడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యాక్టివ్ వ్యక్తి కాదు
నాగచైతన్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే వ్యక్తి కాదు. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా సోషల్ మీడియాలో చేయడానికి ఎక్కువగా ఇష్టపడడు చైతూ. సమంతతో పెళ్లయిన తర్వాత అప్పుడప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించేవాడు. విడాకుల తర్వాత చాలాకాలం అసలు ఇన్స్టాగ్రామ్ జోలికి పోలేదు. ఇప్పుడిప్పుడే తన ట్రిప్స్కు, పర్సనల్ లైఫ్కు సంబంధించిన పోస్టులు వేస్తూ ఫాలోవర్స్ను హ్యాపీ చేస్తున్నాడు. అలాంటి చైతూ.. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమయంలో ఒక బీటీసీ గురించి ట్వీట్ చేయడం కామన్ కాదని, కచ్చితంగా తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు చేస్తన్నారు. ఈ అకౌంట్ హ్యాక్ విషయంపై నాగచైతన్య ఇంకా స్పందించాల్సి ఉంది.
I bought 100 BTC in 2013 with 50$ , which are now worth $6 million. What do you think about doing a giveaway? Vote 🙂
— chaitanya akkineni (@chay_akkineni) October 9, 2024