EPAPER

Samantha : నాగ్ కష్టపడుతున్నాడు… సమంత ఎంజాయ్ చేస్తుంది..

Samantha : నాగ్ కష్టపడుతున్నాడు… సమంత ఎంజాయ్ చేస్తుంది..

Samantha : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత పేరు హాట్ టాపిక్ అవుతుంది. సినిమాల విషయంలో అయితే కాదు కానీ మొన్నీమధ్య తెలంగాణా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజులో దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సమంత పేరు హాట్ టాపిక్ అయింది. సమంత కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్క తాటి పై నిలబడి సమంత పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేశారు. దానికి దిగొచ్చిన మంత్రి సామ్ కు క్షమాపణలు చెప్పింది. అయితే ఈ విషయం పై అక్కినేని నాగార్జున కోర్టు మెట్లేక్కాడు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది.


మంత్రి వ్యాఖ్యల పై కోర్టు మెట్లేక్కిన నాగార్జున..

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం మరింత తీవ్రమవుతోంది. ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా, నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చింది.. కోర్టు ముందు నాగార్జున, తన కుటుంబం ఎప్పటినుంచో మంచి పేరును సంపాదించుకుందని, సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ కక్షసాధింపు కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని నాగార్జున స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్థులు కేసును వాయిదా వేశారు.. అక్టోబర్ 10 న ఈ కేసు ఎలాంటి పరిణామలకు దారి తీస్తుందో చూడాలి..


ఎంజాయ్ చేస్తున్న సమంత..

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభట్‌, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న జిగ్రా సినిమా అక్టోబర్‌ 11న విడుదల కానున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా పాల్గొన్నారు. అనంతరం ఆ సందర్బంగా సామ్ మాట్లాడుతూ.. హీరోయిన్స్‌కి ఎంతో బాధ్యత ఉంటుందని అన్నారు. ప్రతి అమ్మాయి కథలో ఆ అమ్మాయే హీరో అని చెప్పారు. చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆమె మోహంలో ఎక్కడ భాధ అనేది కనిపించలేదు. సమంత నన్ను అన్నదానికి క్షమాపణలు చెప్పేశారు. నాకు అవసరం లేదు అని ఎంజాయ్ చేస్తుంది. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఇక సామ్ కూడా కోర్టుకు హాజరు అవుతుందేమో చూడాలి.. నాగార్జున కుటుంబం పై పడ్డ మచ్చ పై సామ్ ఇంకా స్పందించలేదు. కేవలం తనను రాజకీయాల్లోకి లాగొద్దు అని మాత్రమే చెప్పింది. ఈ విషయం పై మరోసారి చర్చలు నడుస్తున్నాయి. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో అనేది ఇటు ఇండస్ట్రీలో, అటు జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

Related News

Mega Hero’s: మెగా కొడుకు కోసం మెగా తండ్రి త్యాగం.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

Swag Collections : షాకిస్తున్న ‘స్వాగ్ ‘ కలెక్షన్స్.. ఎంత రాబట్టాలంటే?

Singer Sunitha: భర్తతో గొడవ పడ్డ సింగర్ సునీత.. కాపురంలో చిచ్చు?

Viswam Censor : శ్రీను వైట్ల కష్టానికి కత్తెర్లు… ఇక ఆ దేవుడే కాపాడాలి

Rajinikanth Vettaiyan: ఆ క్రేజ్ ఏమైపోయింది తలైవా

Spirit & SSMB29: 2025 లో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ కు ముహూర్తం ఖరారు

×