Central Minister Kishan Reddy in Press meet: జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. , గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు మాతో ఉన్నారని మరోసారి నిరూపితమైందన్నారు.
కేంద్ర పార్టీ నాయకత్వంలో జమ్మూకశ్మీర్ లో నాయకులు ఐకమత్యంతో కష్టపడి పనిచేశారన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సీట్లలో బీజేపీ పార్టీ విజయం సాధించిందన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తామన్నారు.
Also Read: అత్తమామపై కోడలు చేతబడి ప్లాన్.. రివర్స్ ప్లాన్ వేసిన బాబా.. కట్ చేస్తే..
రాహుల్ గాంధీ ప్రజల్లో మోదీపై నమ్మకం, విశ్వాసాన్నికోల్పోయేలా ప్రసంగాలు ఇచ్చారని, వీటిని ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధాని మోదీని చెడు చేసేందుకు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో కూడా ప్రస్తావించారన్నారు. తొలి 100 రోజుల్లో చేసిన అభివృద్ది ఫలితం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు.