Three Died and 12 Injured as Huge Explosion at Crackers godown in Tamilnadu: ఇళ్ల మధ్య భారీ పేలుడు జరిగి మగ్గురు మృతిచెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ పేలుడు ధాటికి సుమారుగా 10 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
Also Read: బాబోయ్.. ఈ కేటుగాళ్లు మరోలెవల్, ఏకంగా నకిలీ బ్యాంక్ పెట్టి లక్షలు కొల్లగొట్టారు!
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో మంగళవారం పేలుడు సంభవించింది. ఇళ్ల మధ్య ఉన్న ఓ గోడౌన్ లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి 10 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ప్రత్యేక అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..