Tips For Skin: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై మెరుపును కాపాడుకోవడానికి మార్కెట్లో చాలా ఖరీదైన ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం అనేక మంది వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇంత చేసినా చాలా సార్లు ముఖంపై మచ్చలు, టానింగ్ వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే, కొన్ని హోం రెమెడీస్తో ముఖం యొక్క మృదుత్వం, మెరుపును పెరిగేలా చేస్తాయి. శనగపిండి, పెరుగుతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ చర్మంపై ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా టానింగ్ను తగ్గిస్తుంది.
శనగ పిండి, పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
జిడ్డు తొలగిపోతుంది: చాలా మంది చర్మం తరుచుగా జిడ్డుగా మారుతుంది. ఇటువంటి పరిస్థితిలో, పెరుగు, శనగ పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోతుంది. ఇది చర్మం రంగును క్లియర్ చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై pH స్థాయిని మెరుగుపరుస్తుంది.
మచ్చలు:
ముఖంపై మచ్చలు రావడం సాధారణ సమస్య. శనగపిండిలో నీరు కలిపి ఆ ఫేస్ట్ తో ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా పెరుగు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. శనగపిండి, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.
చర్మంపై తేమ:
ముఖం డ్రైగా మారితే పెరుగు శెనగపిండితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Also Read: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?
ముడతలను తగ్గించండి:
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు కూడా పెరగడం ప్రారంభమవుతాయి. శనగపిండి, పెరుగుతో చేసిన ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు తగ్గుతాయి.
శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేసే విధానం:
శనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి వేసి అందులో రెండు చెంచాల పెరుగు కూడా వేయాలి. దీన్ని మిక్స్ చేసి చర్మంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత, నీటితో ముఖం కడుక్కోండి. తేలికగా రుద్దడం ద్వారా ముఖం శుభ్రం చేసుకోండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.