EPAPER

Nikhil: దీపావళికి కొత్త సినిమాతో వచ్చేస్తున్న యంగ్ హీరో.. మరి ఆ ప్యాన్ ఇండియా మూవీ పరిస్థితి ఏంటి?

Nikhil: దీపావళికి కొత్త సినిమాతో వచ్చేస్తున్న యంగ్ హీరో.. మరి ఆ ప్యాన్ ఇండియా మూవీ పరిస్థితి ఏంటి?

Actor Nikhil: ఈరోజుల్లో సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా దాదాపుగా అందరూ ప్యాన్ ఇండియా చిత్రాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇలాంటి సినిమాలను ఎక్కువగా మైథలాజికల్ కథలతో తెరకెక్కించడానికే ఇష్టపడుతున్నారు. ఇక ప్రతీ సినిమాకు డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లే నిఖిల్ సైతం ఒక ప్యాన్ ఇండియా మూవీని లైన్‌లో పెట్టాడు. మరే ఇతర స్క్రిప్ట్స్‌ను ఓకే చేయకుండా ఈ సినిమా కోసమే నిఖిల్ కష్టపడుతున్నాడని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. కథలో కొత్త ట్విస్ట్ యాడ్ అయ్యింది. అసలు ఆ ప్యాన్ ఇండియా మూవీ ఎటు పోయిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.


కొత్త సినిమా ప్రకటన

‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తెలుగులో కాకుండా హిందీలో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో హిందీ ఆడియన్స్ మైథలాజికల్ సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారని తెలిసిన నిఖిల్.. తన తరువాతి సినిమా ‘స్వయంభు’పై ఫోకస్ పెట్టాడు. ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన సినిమాలు ఏవీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అందుకే ‘స్వయంభు’ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. వర్కవుట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ సినిమా గురించి కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే అప్డేట్స్ ఇచ్చేవాడు నిఖిల్. కానీ ఉన్నట్టుండి ‘స్వయంభు’ను పక్కన పెట్టి ఒక కొత్త మూవీ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.


Also Read: ప్రపంచంలోనే అత్యంత రిచ్ యాక్టర్ కానీ ఒక్కటే హిట్.. షారుఖ్ కాదు.. ఎవరో తెలుసా?

దానికే ప్రమోషన్స్

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అని ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కింది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యిందో.. ఎప్పుడు ముగిసిందో తెలియదు కానీ తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మేకర్స్. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది దీపావళికే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ విడుదల కానుందని ప్రకటించారు. ఎప్పుడూ ‘స్వయంభు’ సినిమానే ప్రమోట్ చేస్తూ దానిపైనే ఫోకస్ చేసిన నిఖిల్.. అసలు ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

రిఫ్రెషింగ్ పెయిర్

‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీలో నిఖిల్‌కు జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటించింది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది రుక్మిణి. దీంతో తనకు తెలుగు మేకర్స్ నుండి కూడా ఆఫర్స్ క్యూ కట్టాయి. అందులో మొదటిగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించింది. తాజాగా విడుదలయిన మూవీ ఫస్ట్ లుక్‌లో నిఖిల్, రుక్మిణి పెయిర్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోందని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మరి ‘స్వయంభు’ పరిస్థితి ఏమైంది అని కూడా నిఖిల్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫీలవుతున్నారు.

Related News

Kalyan Ram: ఈ దెబ్బతో కళ్యాణ్ రామ్ దశ తిరిగినట్టేనా..?

Devara Success Meet: ఈ హరి ఎవరు? ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం.?

Jani Master: జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ ఇవ్వాలి, ఆ అమ్మాయే అలా చెప్పింది.. నిజాలు బయటపెట్టిన కొరియోగ్రాఫర్

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

World’s Richest Actor: ప్రపంచంలోనే అత్యంత రిచ్ యాక్టర్ కానీ ఒక్కటే హిట్.. షారుఖ్ కాదు.. ఎవరో తెలుసా?

Tollywood Actress: బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీస్…

×