Genelia.. జెనీలియా (Genelia).. బొమ్మరిల్లు సినిమాలో హ..హ.. హాసిని అంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ పాలబుగ్గలు సుందరి. తన అందంతో , అమాయకత్వంతో తెలుగు ఆడియన్స్ ను తన వశం చేసుకుంది. తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని, అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో ఆదర్శ జంటలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 లో మొదటిసారి కలుసుకున్నారు. చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు కూడా.. అలా పదేళ్ల ప్రేమ తర్వాత 2012లో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
అర్ధరాత్రి బ్రేకప్ చెప్పాడు..
ఇకపోతే రితీష్ దేశ్ ముఖ్ – జెనీలియా తరచుగా అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతూనే ఉంటారు. తమ ఫ్యామిలీ లైఫ్ లో జరిగే విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం ఈ జంటకు అలవాటు. అయితే ఒక అర్ధరాత్రి రితీష్ పెట్టిన ఒక మెసేజ్ చూసి తాను కంగారుపడి, చాలా కృంగిపోయానని జెనీలియా వ్యాఖ్యానించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. జెనీలియా మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటాక తెలతెల్లవారుతుండగా 2:30 గంటల సమయంలో ఆ టెక్స్ట్ మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థం కాక ఒక్క క్షణం నా మైండ్ బ్లాక్ అయింది. ఆవేదనతో గుండె బరువెక్కింది అంటూ జెనీలియా తెలిపింది.
అసలేం జరిగిందంటే..?
అసలు విషయంలోకి వెళితే.. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించిన జెనీలియా ఈ విషయాలను వెల్లడించింది. జెనీలియా మాట్లాడుతూ.. మేము డేటింగ్ చేసుకునే సమయంలో రితీష్ చాలా ఆలస్యంగా నిద్రపోయేవాడు. అయితే ఒకరోజు రాత్రి విడిపోదాం అంటూ రితీష్ నాకు మెసేజ్ పంపాడు. మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నప్పుడు అది ఏప్రిల్ ఫూల్స్ డే.. ఆ సమయంలో నాకు.. ఇక బ్రేకప్ అని మెసేజ్ పంపాడు. ఆ తర్వాత అతడు నిద్రపోయాడు. అయితే ఆ మెసేజ్ ను నేను చాలా ఆలస్యంగా చూశాను. అతడు రాత్రి 1:00 గంటకు పంపితే, నేను దానిని 2:30 గంటలకి చదివాను. అది చదవగానే నిరాశకు గురయ్యాను. ఉదయం 9 గంటల వరకు అంటే రితీష్ మేలుకొనే వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం రితీష్ నాకు ఫోన్ హాయ్ ఏం చేస్తున్నావ్ అని అన్నాడు. అయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను. ఆ తర్వాత రోజు రాత్రి వరకు రితీష్ పంపిన టెక్స్ట్ మెసేజ్ లు కూడా నేను చదవలేదు. కానీ రితీష్ అసలు విషయాన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత నేనే గుర్తు చేయడంతో ఏప్రిల్ ఫూల్ సందర్భంగా ఇలా చెప్పాను అని చెప్పి ఆ తర్వాత కూల్ చేశారు అంటూ తెలిపారు జెనీలియా.
పెళ్లయిన తర్వాత ఆ బాధ వర్ణనాతీతం.
అంతేకాదు రితీష్ తో వివాహం జరిగిన ఒక నెల తర్వాత కూడా తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. జెనీలియా మాట్లాడుతూ.. రితీష్ సాంప్రదాయక మరాఠీ కుటుంబానికి చెందినవారు.. ప్రతిరోజు సాంప్రదాయ దుస్తులు, భారీ ఆభరణాలతో అలంకరించుకోవాలి . ఈ విషయాలను నాతో చెప్పాడు. కొన్ని రోజులు ఇలా చేశాను కానీ ఆ తర్వాత నాతో కాలేదు. దానితో నేను ఒక రోజు ఉదయం ఇకపై ఇలా నేను చేయలేను అని కన్నీళ్ళతో నా బాధను చెప్పుకున్నాను. ఇక రితీష్ అర్థం చేసుకొని ఓదార్చాడు అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది మొత్తానికైతే తమ జీవితంలో జరిగే కష్టాలను , సుఖాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆదర్శ జంటగా నిలిచింది ఈ జంట.