Adilabad : డాక్టర్ల నిరక్ష్యానికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ నిండు ప్రాణం బలైపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామానికి చెందిన రమ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 22వ తేదీన మండలంలోని పీహెచ్సీ కి తీసుకురాగా మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కాన్పు జరిగిన వెంటనే మహిళకు దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర రక్తస్రావమైన సిబ్బంది పట్టించుకో లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లు స్థానికంగా లేకపోవడం వల్ల దళిత మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. మహిళ మృతికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.